Monday, January 1, 2018

NEW YEAR CELEBRATIONS 1-1-2018

స్వామి వారి దివ్య ఆశీస్సులతోశ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోఠి సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఊస్మాన్గంజ్ తొప్ఖానాలో గల ఒకేషనల్ ట్రైనింగ్ కోర్స్ టైలరింగ్ సెంటర్లో  రోజు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగా  జరిగాయి . ఈ కార్యక్రమంలో  టైలోరింగ్లో శిక్షణ పొందుతున్న మహిళలు మరియు వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి శ్రీమతి పద్మావతి గారు , వాణి గారు జ్యోతి ప్రకాశనం గావించిన అనంతరం వేదము , భజన తో ప్రారంభం అయ్యి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశమును ను సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి అనేక ఉదాహారణలతో తెలియజేస్తూ , శిక్షకులకు నూతన సంవత్సర విశిష్టత  తెలియజేసి అందరికి నూతన ఉత్తేజాన్ని కలుగజేసారు . స్వామి వారి సందేశము ::

ప్రతి క్షణము నూతన సంవత్సరమే - కొత్త సంవత్సరములుకొత్త నెలలు మనకు ఆనందాన్నిదుఃఖాన్నికష్టాన్ని తీసుకొని రావటంలేదుప్రతి సెకండ్ కూడను ఒక నూతనమైనటువంటిదేసెకండ్ లేక నిమిషము రాదునిమిషము లేక గంటలు రావుగంటలు లేక దినములు గడువవుదినములు లేక నెలలు గడువవునెలలు లేక సంవత్సరం కాదుకాబట్టి  సంవత్సరం అంతయు కూడను క్షణములతోనే ఆధారపడి ఉంటున్నాదిప్రతి క్షణము కూడను మనము పవిత్రముగా అనుభవించినప్పుడే సంవత్సరము నూతన సంవత్సరము అవుతుందిఒక్కొక్క క్షణము మనము ఎట్టి కార్యముల చేతఎట్టి గుణముల చేతఎట్టి ప్రవర్తన చేత కాలము గడుపుతున్నామోదాని ఫలితమే మన సంవత్సర ఫలితం.  స్వామి సందేశానంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వామి సందేశాన్నివారి దినందిక జీవితంలో  అమలు పరిచే విధంగా శక్తిని ఇవ్వమని స్వామిని వేడుకొన్నారు . అందరు కలిసి స్వామి వారికీ మంగళ హారతి ఇవ్వగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో పద్మావతి , వాణి , సరితా , అంజమ్మ , అనూష , జ్యోతి లక్ష్మి , పూసా జ్యోతి , జ్యోతి తివారి , మేఘన  తివారి , మనీషా , రచన మిశ్ర తదితరులు పాల్గొన్నారు .
 ఫోటోలు జత చేయడం అయినది .
 సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి  

No comments:

Post a Comment