Wednesday, February 21, 2024

EXAMINATION DATED 21-2-2024

 


On February 21, 2024, an exam was conducted for skill development trainees from 11:30 AM to 1:00 PM. A total of 13 trainees participated in the exam. Mrs. Padmavathi and Mrs. Vani conducted the exam, which consisted of both oral and written components.

ఈ రోజు అనగా 21-2-2024 న 11-30 గంటల నుండి 1 గంట వరకు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్ కి పరీక్ష నిర్వహించారు. మొత్తము 13 మంది ట్రైనీస్ ఈ పరీక్ష లో పాల్గొన్నారు. శ్రీమతి పద్మావతి, శ్రీమతి వాణి, ఓరల్ గా మరియి వ్రాత పరీక్ష నిర్వహించారు. 













Sunday, February 18, 2024

MAHILA DAY CELEBRATIONS. 19-2-2024 12 NOON ONWARDS.

 MAHILA DAY CELEBRATIONS. 19-2-2024 12 NOON ONWARDS


















19-2-2024

Women's Day Celebrations at Sri Sathya Sai Skill Development Center

The Women's Day program was organized by Sri Sathya Sai Seva Samithi, Koti Samithi at Sri Sathya Sai Skill Development Center with great devotion and enthusiasm.

The program began with the chanting of Sai Gayatri Mantra 11 times by all the participants. Smt. Padmavathi, Smt. Vani and Jyothi Prakasham lit the lamp to mark the inauguration of the program.

Smt. Padmavathi, Smt. Vani, Smt. Veena, Smt. Swapna, Smt. Prasanna Lakshmi, Smt. Sireesha S., Smt. Lakshmi, Smt. Kalyani, and Smt. Sri Devi spoke on the occasion and extended Women's Day greetings to all.

They spoke about the sacrifices and contributions of women like Jhansi Lakshmi Bai and Indira Gandhi.

Smt. Sri Devi, Lakshmi, Prasanna, and Susma shared their experiences with their mothers and expressed their gratitude for their love and support. They also pledged to live up to their mothers' expectations and excel in the tailoring field.

Smt. Sri Devi, who is illiterate, said that she is not ashamed of it and that she will learn tailoring to prove her critics wrong.

The program concluded with a Mangala Harathi offered to Bhagavan Sri Sathya Sai Baba.

B. Sushma deserves special appreciation for live-streaming the entire program on WhatsApp video.


19-2-2024 

ఈ నాటి మహిళా దినోత్సవ కార్యక్రమము శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో. శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఘనంగా, ఎంతో భక్తి, శ్రద్దలతో జరిగినది. సాయి గాయత్రి మంత్రాన్ని అందరు కలసి, 11 సార్లు పాటించిన అనంతరం, పద్మావతి, శ్రీమతి వాణి, జ్యోతి ప్రకాశనం గావించగా, శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి వాణి గారు, శ్రీమతి వీణా  గారు, శ్రీమతి స్వప్న గారు, శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారు, శ్రీమతి శిరీష ఎస్. శ్రీమతి లక్ష్మి గారు, కల్యాణి గారు, శ్రీమతి శ్రీ దేవి గారు, అనూష గారు, అందరు  మాట్లాడుతూ, అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఝాన్సీ లక్ష్మి గారి గురించి, ఇందిరా గాంధీ గారి గురించి, మాట్లాడినారు. ముఖ్యంగా, శ్రీ దేవి, లక్షి, ప్రసన్న, సుస్మా తదితరులు, వారి వారి తల్లుల ఘనతను చెప్తూ, తల్లి యెక్క ప్రేమను, త్యాగమును, వివరించి, వారి తల్లులను దేవతగా వర్ణించుకుంటూ, ఆనందభాష్పములు, కార్చుకుంటూ, వారిని స్మరించుకుంటూ, ఆనందానికి, బాధకు లోనై, తల్లి వారి పైన ఉంచిన ఆశలకు అనుగుణముగా, ప్రవరిస్తూ, ప్రస్తుతము వారు నేర్చుకుంటున్న టైలోరింగ్ రంగములో, ముందుకు వెళ్తూ, అందరి ప్రశంశలు పొంది అందరికి మంచి పేరు తెస్తామన్నారు. ముఖ్యంగా శ్రీ దేవి మాట్లాడుతూ, తనకు చదువు రాదని, చదువు రాదని చెప్పుకొనుటకు ఏమాత్రము సిగ్గు పదాననని, నన్ను అవమానించిన వారికీ నేను టైలోరింగ్, నేర్చుకొని, వారికీ గుణపాఠము చెప్తానని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికీ శ్రీ దేవి మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. బి. సుష్మ తన సెల్ ఫోన్ ద్వారా కార్యక్రమాన్నంతా నాకు వాట్సాప్ ఆన్లైన్  వీడియో లో  ప్రసారం గావించిన విధానం శ్లాఘనీయం. 





SATURDAY - HANUMAN CHALISA SPECIAL PROGRAM. 17-2-2024

 SATURDAY - HANUMAN CHALISA SPECIAL PROGRAM. 

17-2-2024  FOR TEN MINUTES. 





12 MEMBERS PARTICIPATED 

Wednesday, February 14, 2024

Tuesday, February 13, 2024

Roll Brown Paper for Skill Development Trainees:

 




Water filter installed at skill dev center 17-2-2024 

శ్రీమతి వాణి గారు మరియు ప్రసన్న గారు ఎంతో కష్టపడి, ఇష్టపడి, భజన హాల్ నుండి పురానాపూల్ కు తీసుకొని వెళ్లి, ప్రసన్న గారు వారి ఇంట్లో వాటర్ ఫిల్టర్ ను శుబ్రహపరచి, బస్సులో, ఫిల్టర్ ను తీసుకొని వచ్చిన ప్రసన్న కు స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ సేవ తన ఒక్కరికే కాకుండా, కో- ట్రైనీస్ కి అందరికి ఉపయోగపడేలా చేసిన వారికీ అందరు కలసి ధన్యవాదములు తెలుపండి. 

Friday, February 9, 2024

SMT MADHAVI LATHA VISITS SRI SATHYA SAI SKILL DEV CENTRE - OSMAN GUNJ, HYD. 9-2-2024




Visit of Ms. Madhavi Latha, Telangana Skill Development Incharge
Date: February 9, 2024
Time: 1 PM
Location: Koti Samithi Skill Development Center, Hyderabad

Event Details:

Ms. Madhavi Latha delivered a speech to skill development trainees.
Emphasized that everyone is unique and created by God, discouraging comparisons.
Highlighted the importance of happiness in life and urged trainees to strive for their goals.
Stressed that service reduces ego and even kind words to others are service.
Trainees shared their experiences and opinions.
Ms. Madhavi Latha offered guidance and advice to trainees.
Convener P Vishweshwar Shastri expressed gratitude to Ms. Madhavi Latha.
Trainees gifted a picture of Swami to Ms. Madhavi Latha.
A QR code for daily attendance was launched.
Key Takeaways:

Implement Swami's teachings in life.
Respect and love everyone.
Work towards achieving your goals.
Service makes us better people.
Event concluded successfully.

Sai Ram

ఈ రోజు అనగా 9-2-2024    , మధ్యాహ్నం 1    గంటకు, (మహిళ) తెలంగాణ రాష్ట్ర  స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జి  శ్రీమతి మాధవీలత గారు   మన కోటి సమితి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్సించి నారు. 

ట్రైనీస్ ఉద్దేశించి పలు అంశాలను, స్వామి వారి బోధలను, వివరించి, స్వామి వారి ప్రేమ త్వత్వం ను వివరించారు. 

ఈ కార్యక్రమములో, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి,  కోటి సమితి ట్యూటర్, పద్మావతి, వాణి మరియు శిక్షణ పొందుతున్న 13 మంది ట్రైనీస్ పాల్గొన్నారు. 

శ్రీమతి మాధవీలత గారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్ ఉద్దేశించి, దిశా నిర్దేశం చేస్తూ, స్వామి మాటలను మననం చేసుకుంటూ ఈ విధంగా వారి ప్రసంగం కొనసాగినది. 

మనమంతా  భగవంతుడు సృష్టించిన  క్రియేషన్స్ మని,  అని అన్నారు. 

మనకు ఏమైనా డిప్రెషన్స్ ఆలోచనలు  వచ్చినప్పుడు, మనము కృంగక, భగవంతుడు  నన్ను ఏదో ఒక పనిమీది సృష్టించాడు కదా, అనుకోని, భూమ్మీదికి పంపించాడు అనుకోవాలి.  ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి అవసరం ఉన్నది సృష్టికి అందరూ అవసరమే ఒకరు ఒకరితో కంపేర్ చేయవలసిన అవసరం లేదు కానీ మనం చేస్తున్నదే  కంపారిజన్  అని అన్నారు 

ప్రతి ఒక్కరూ నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు.  కాబట్టి మనం ముందు అందర్నీ రెస్పెక్ట్ చేయాలి మర్యాద ఇవ్వాలి అని అన్నారు అదేవిధంగా నన్ను అందరూ ప్రేమించాలి అన్నప్పుడు మనం కూడా అందరిని ప్రేమించడం నేర్చుకోవాలి అందరూ నాపై జాలి, కరుణ చూపాలి  అని మనం ఏ రకంగా అయితే అనుకుంటామో అదేవిధంగా మనం అందరిపైనా జాలి చూపించాలి అని అన్నారు. 

పల్లెల్లో ఉండే వారి కన్నా సిటీలో  అందులో ముఖ్యంగా కోటిలో ఉన్న మీరంతా ఎంతో అదృష్టవంతులు అన్నారు ఎందుకంటే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ను మీరు చూస్తూ ఉంటారు ఇవన్నీ చూసినప్పుడు మనం మన జీవితాల్లో ఎంతో ముందుకు సాగాలి అనే కోరిక వస్తుంది, అని అన్నారు.  అన్నింటికన్నా ముఖ్యంగా జీవితంలో హ్యాపీనెస్ అనేదే ముఖ్యం.   మనం మన గోల్ను పెట్టుకొని ముందుకు సాగాలని అన్నారు. 

వాట్సాప్ గ్రూపులో, నేను ఈ వారంలో ఇంత అమౌంట్ సంపాదించాను, మాకు తెలిసిన వాళ్ళకి నేను ఫ్రీగా కుట్టించాను అనే వివరాలు వాట్సాప్ గ్రూప్ లో మెన్షన్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని వారు అన్నారు. 

ఇది మీకు ముందు ముందు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ కావాలంటే ఈ రకంగా చేయాలని తెలియజేశారు మనం ఎప్పుడు ధనికులను చూసి కంపేర్ చేసుకోకూడదని మనకు తెలియని విషయాన్ని అప్పటికప్పుడు సిగ్గుపడకుండా అడిగి తెలుసుకుంటే ముందుకు సాగగలమని సెలవిచ్చారు. 

భగవాన్ బాబా వారి సూక్తులలో లవ్ ఆల్ -  సర్వాల్ విషయాలన్నీ తెలియజేస్తూ సేవ మనలోని అహంకారాన్ని తగ్గిస్తుందని తెలియజేశారు.  సేవలలో మనం ఎన్నో రకాలు.  కేవలం డబ్బు సహాయం చేస్తేనే సేవ చేసినట్లు కాదని ఎదుటివారితో ముఖ్యంగా  అనారోగ్యంగా ఉన్న వారితో వారి మాటలు విని వారికి ఉపశమనాన్ని ఇచ్చే ఒక్క మాటలో సమాధానం చెప్పి వారిని సంతృప్తి పరచగలిగితే అది కూడా మంచి సేవ అని శ్రీమతి మాధవి లత గారు అనేక విషయాలు తెలియజేశారు. 

ట్రైనీస్ కొందరు, నిధి జోషి, ప్రసన్న, వీణ, తేజస్వి, తదితరులు, ఎన్నో విషయములు తెలిపిన శ్రీమతి మాధవి లత గారికి ధన్యవాదములు తెలుపుతూ, ఈ సెంటర్ ప్రతి గురువారం భజన, మరియు, శనివారం, హనుమాన్ చాలీసా, కార్యక్రమములు కన్వీనర్ సూచనల ప్రకారం కొనసాగిస్తున్నామని, తణ్డులర్చన కార్యక్రమములో పాల్గొన్నామని తెలియజేశారు. 

ముఖ్యంగా శ్రీ విద్య మాట్లాడుతో, తను, ఒక సంస్థలో 20,000 ఫీజు కట్టి, మోసపోయి నట్లు తెలిపి బోరున విలపించింది. శ్రీమతి మాధవి లత గారు, ఒక తల్లి లాగ శ్రీ విద్యను ఓదార్చి, శ్రీమతి పద్మావతి గారికి, శ్రీ విద్య పై ప్రత్యేక శ్రద్ద పెట్టి నేర్పామన్నారు. 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటీ సమితి పక్షాన, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, శ్రీమతి మాధవి లత గారు స్వామి పూర్వ విద్యార్థిని అని, ఈ మధ్య జరిగిన శ్రీ సత్య సాయి నిగమాగం లో జరిగిన మహిళా యూత్ కార్యక్రమాల్లో వారు 1600 మహిళా యూత్ ను ఉద్దేశించి, ప్రసంగించారని, ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారని, అంతటి వారు, ఈరోజు ఉదయం నుంచి, స్వామి కార్యక్రమంలో, పాల్గొంటూ,  అలుపు లేకుండా, మన సెంటర్ ను సందర్శించడం, నిజంగా, స్వామి సంకల్పంగా భావిస్తూ,  మాధవి లత గారికి, స్కిల్ డెవలప్మెంట్, ట్రీనిస్, తరఫున మరియు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి తరపున హృదయపూర్వకమైన, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్,  అంతా కలిసి, కోటి సమితి పక్షాన, స్వామి వారి ప్రేమను, ఈ మధ్యనే అంటే, జనవరి 22వ తేదీన అయోధ్యలో, ప్రాణ ప్రతిష్ట గావించిన, బాల రాముడి, చిత్రపటాన్ని బహూకరించారు. తదనంతరం, డైలీ అటెండెన్స్, కోసం రూపొందించిన, ఒక క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సభా కార్యక్రమాన్ని ముగిసినట్లుగా తెలిపారు.  సాయిరాం